కరోనా ఎఫెక్ట్తో విద్యార్థులు పాఠశాలల మొహం చూడక చాలా రోజులైంది. కేవలం ఆన్లైన్ క్లాసులు మాత్రమే వింటున్నారు. పట్టణ ప్రాంత విద్యార్థులకు పెద్దగా ఇబ్బంది లేదుగానీ.. పల్లె ప్రాంతాల్లోని విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు వినడం కాస్త కష్టతరంగానే ఉంది. విద్యుత్, ఇంటర్నెట్ అంతరాయాలు, మరికొందరికి స్మార్ట్ ఫోన్లు కొనే స్తోమత లేకపోవడం వెరసి విద్యార్థులకు విద్యాబోధన సాగడం లేదు.
ఇదిలా ఉంటే ఏపీలో పాఠశాలలు ప్రారంభించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్ట్ 16 నుంచి స్కూల్స్ ఓపెన్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నెల 12నుంచి విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు ప్రారంభించబోతున్నారు. ఇవాళ విద్యాశాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక నిర్ణయాలు తెలుసుకున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ‘నాడు- నేడు’ పేరిట పాఠశాలల రూపురేఖలు మారుస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నాడు- నేడుకు సంబంధించి పెండింగ్ పనులన్నీ పూర్తిచేయాలని జగన్ ఆదేశించారు.
Also Read: ‘సెకండ్వేవ్’ ముప్పు ఇంకా ఉంది.. కేంద్రం వార్నింగ్
ఈ నెల 15 నుంచి ఆగస్టు 15 వరకు వర్క్ బుక్స్పై ఉపాధ్యాయులకు శిక్షణ ఉంటుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ఇంటర్ విద్యార్థులకు 70 శాతం ఇంటర్ ప్రథమ సంవత్సరం మార్కులు.. పదో తరగతి నుంచి 30 శాతం మార్కులు కేటాయిస్తామన్నారు. ఈ నెలాఖరుల లోపు ఇంటర్ విద్యార్థులకు మార్కుల మెమోలు జారీ చేస్తామని చెప్పారు.
12 నుంచి జూనియర్ కళశాలలు ఓపెన్..
ఈ నెల 12 నుంచి జూనియర్ కళాశాలలు ఓపెన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రెండో ఏడాది అకడమిక్ కేలండర్ను ఇంటర్ విద్యామండలి విడుదల చేసింది. బోధన, బోధనేతర సిబ్బంది విధులకు హాజరుకావాలని సూచించింది. తరగతులను ఆన్లైన్లో నిర్వహించనున్నారు.
Also Read: ఇలా చేస్తే థర్డ్ వేవ్ రాకపోవచ్చు.. !