దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్నాయని.. సెకండ్వేవ్ ముప్పు పోయిందని అంతా భావిస్తున్న తరుణంలో కేంద్ర ఆరోగ్యశాఖ బాంబు పేల్చింది. సెకండ్వేవ్ ముప్పు అప్పుడే పోలేదని.. ఇంకా చాలా జిల్లాల్లో దాని ప్రభావం ఉందని హెచ్చరికలు జారీచేసింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో చాలా రాష్ట్రాలు లాక్డౌన్ ఎత్తేసిన విషయం తెలిసిందే. మరోవైపు ప్రజలు సైతం విచ్చలవిడిగా బయట తిరుగుతున్నారు. మాస్కులు ధరించడం లేదు. భౌతికదూరం పాటించడం లేదు. యథావిధిగా పెళ్లిళ్లు, ఇతర వేడుకలు జరుపుకొంటున్నారు. ఈ క్రమంలో కేంద్రం హెచ్చరికలు జారీచేసింది.
కేరళ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, చత్తీస్ఘడ్, మణిపూర్ రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి ఇంకా తగ్గలేదని.. పాజిటివ్ రేటు ఎక్కువగానే ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా 71 జిల్లాల్లో కరోనా కేసులు అధికంగా ఉన్నాయని పేర్కొన్నది. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
Also Read: ఇలా చేస్తే థర్డ్ వేవ్ రాకపోవచ్చు.. ! గులేరియా
ఇంకా కేంద్ర ఆరోగ్య శాఖ ఏమన్నదంటే.. ‘దేశంలో కరోనా కొంత మేర తగ్గుతున్నది. 86 శాతం తగ్గుదల నమోదైంది. గతంలో 81.1 శాతం ఉన్న రికవరీ రేటు .. ప్రస్తుతం 97 శాతంగా ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా సాగుతోంది’ అని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. నిన్న ఒక్కరోజే దేశంలో కొత్తగా 46వేల 617 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,04,58,251కి చేరింది.
Also Read: కరోనాతో మెదడు కణజాలంపై ప్రభావం..!