కరోనా థర్డ్వేవ్ విషయంపై దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. థర్డ్వేవ్ అనివార్యం అంటూ కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. థర్డ్వేవ్ చాలా భయంకరంగా ఉంటుందని.. మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉండొచ్చని కొందరు హెచ్చరిస్తున్నారు. మరికొందరు మాత్రం థర్డ్వేవ్ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని సూచిస్తున్నారు. ఈ క్రమంలో కరోనా థర్డ్వేవ్పై ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా స్పందించారు.
‘ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కరోనా థర్డ్ వేవ్ రాకపోవచ్చు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. దీన్ని మరింత ముమ్మరం చేయాలి.అంతేకాక ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్ తప్పకుండా ధరించాలి. భౌతికదూరం పాటించాలి. ఇలా చేస్తే థర్డ్వేవ్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి తగ్గింది. కొన్ని ప్రాంతాల్లో ఇంకా కరోనా పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉంది. అక్కడి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.
Also Read: ఆల్ఫా, డేల్టా వేరియంట్ ఏదైనా.. కోవాగ్జిన్ అ సూపర్..!
కరోనా థర్డ్ వేవ్ వచ్చినా పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. కానీ ప్రజలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక వ్యాక్సిన్ డోస్ మిక్సింగ్పై ఇంకా పరిశోధనలు సాగుతున్నాయి. ఈ విషయంపై అప్పుడే ఏ నిర్ణయం తీసుకోలేము. వ్యాక్సిన్ డోసు మిక్సింగ్పై మరింత డాటా అవసరం’ అని గులేరియా పేర్కొన్నారు. దేశంలో కరోనా థర్డ్వేవ్ ప్రభావం ఉంటుందన్న ఆందోళన నెలకొన్న నేపథ్యంలో గులేరియా ఈ మేరకు మాట్లాడారు. ఇప్పటికే దేశంలో అక్కడక్కడా కరోనా కేసులు వస్తున్నాయి.
Also Read: కరోనాతో మెదడు కణజాలంపై ప్రభావం..!