- Advertisement -
ఏపీ మంత్రి అఖిల ప్రియ త్వరలో పెళ్లిపీటలెక్కనున్నారు. హైదరాబాద్లోని ఆమె నివాసంలో కుటుంబ సభ్యుల మధ్య భార్గవ్తో నిశ్చితార్థం జరిగింది. వీరి వివాహం ఆగస్టు 29వ తేదీన జరగనుంది. భార్గవ మంత్రి నారాయణకు దగ్గరి బంధువు అని తెలుస్తోంది. మాజీ డీజీపీ సాంబశివరావుకు కూడా బంధువు అవుతారు. గత కొద్ది కాలంగా అఖిలప్రియ, భార్గవ ప్రేమించుకుంటున్నట్టు తెలుస్తోంది.
తండ్రి భూమా నాగిరెడ్డి మరణంతో అనూహ్యంగా మంత్రి పదవి లభించింది అఖిలప్రియకు. అయితే జిల్లాలో అఖిల ప్రియపై అనేక విమర్శలు ఉన్నాయి. సీనియర్ నాయకులను లెక్కచేకపోవడం, వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వడంలేదన్న సంగతి తెలిసిందే.జిల్లా రాజకీయాల్లో అఖిల దాదాపు ఒంటరే అని చెప్పవచ్చు.
అఖిల పెళ్లి చేసుకోవడం ఆమెకు కలసి వచ్చే అంశం. కాబోయో భర్త భార్గవ్ మంత్రి నారాయణ పెద్దల్లుడి సోదరుడు మరో వైపు మాజీ డీజీపీ సాంబశివరావు మేనళ్లుడు. పెళ్లి రాజకీయంగా ఆమెకు కలసి వచ్చే అంశమే. వాస్తవానికి 2010లోనే ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే రవీంద్ర నాథ్రెడ్డి తనయుడితో పెళ్లి జరిగింది. అను కోని కారణాల వల్ల విడాకులు తీసుకుంది.
ఈ వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు.. ప్రభుత్వంలో ఉన్న వారందరికీ తెలిసిన సంగతే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అఖిలప్రియ నిశ్చితార్థానికి పరిమిత సంఖ్యలోనే అతిధులను ఆహ్వానించినట్లు సమాచారం.