- Advertisement -
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈరోజు ఉదయం నుంచి కొనసాగుతోంది.రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు బారులు తీరారు.సామాన్య ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా క్యూలో నిల్చుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
ఇక స్టార్ మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే తన కుటుంబంతో కలిసి వచ్చి ఓటు వేశారు. ఓటు వేసేందుకు క్యూ లైన్లో నిల్చున్న ఫొటోను కుంబ్లే తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఇక మరో క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ కూడా ఈ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. కన్నడ నటులు రమేశ్ అరవింద్, రవిచంద్ర, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ కూడా ఓటు వేశారు.