అప్ కన్వీనర్ ఢిల్లీ సీఎం కేజ్రీపై లంచం ఆరోపణలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.ఇప్పటికే ఆయనమీద లెప్టినెంట్ గవర్నర్ విచారనకు ఆదేశించారు.ఇప్పుడు తాజాగా కేజ్రీగురువైన సామాజికి ఉద్యమకారుడు అన్నాహజారే చేస్తున్న విమర్శలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
ఆరోపనలు ఎదుర్కొంటున్న కేజ్రీ వెంటనే రాజీనామ చేయాలని డిమాండ్ చేశారు. అవసరం అనుకుంటె ఆందోళన చేస్తానని ప్రకటించారు.
రెండు మూడు రోజులుగా కేజ్రీపై మాజీ మంత్రి కపిల్ మిశ్రా చేసిన అవినీతి ఆరోపనలమీద కూడా ఈన్నా హజారె స్పందించారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడే డబ్బులు చేతులు మారి ఉంటే, అప్పుడే ఎందుకు అధికారులను అప్రమత్తం చేయలేదని అన్నాహజారే ప్రశ్నించారు.మంత్రి పదవి పోయిన తర్వాత ఆరోపనలు చేశారన్నారు.
{loadmodule mod_custom,Side Ad 1}
కేసులో విచారణ లోతుగా జరగాలని … ఒకవేల కేజ్రీవాల్ తప్పు చేసినట్లు రుజువైతే తాను జంతర్ మంతర్ వద్ద నిర్వహించే ఆందోళనలో స్వయంగా కూర్చుని అతడి రాజీనామా డిమాండ్ చేస్తానని తెలిపారు. మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా రాలెగావ్ సిద్దిలో గల తన ఇంట్లో ఆయన ఈ విషయమై మీడియాతో మాట్లాడారు.
ఒకప్పుడు అవినీతికి వ్యతిరేకంగా తనతో కలిసి పోరాడిన కేజ్రీవాల్ మీద ఇప్పుడు డబ్బులు తీసుకుంటున్నాడన్న ఆరోపణలు రావడం తనకు ఎంతో బాధ కలిగిస్తోందని అన్నారు. కేజ్రీవాల్ తన మంత్రివర్గంలోని సత్యేంద్ర జైన్ నుంచి రూ. 2 కోట్లు తీసుకుంటుండగా తాను చూశానని కపిల్ మిశ్రా ఆరోపించగా, దాన్ని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా ఖండించిన విషయం తెలిసిందే.ఇప్పుడది చిలికిచిలికి గాలివానలా మారుతోంది.ఈకేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసకుంటాయే చూడాలి.
{loadmodule mod_sp_social,Follow Us}
Also Read