Thursday, May 16, 2024
- Advertisement -

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ స‌రిహ‌ద్దుల్లో మ‌రో భారీ ఎన్ కౌంట‌ర్‌… ఆరుగురు మావోల మృతి

- Advertisement -

మావోయిస్టుల‌కు మ‌రో సారి కోలుకోలేని దెబ్బ త‌గిలింది. తెలంగాణ – ఛత్తీస్ గఢ్ సరిహద్దులు మరోసారి రక్తమోడాయి. మావోయిస్టులు సమావేశం అవుతున్నారన్న విశ్వసనీయ సమాచారాన్ని తెలుసుకున్న గ్రేహౌండ్స్ దళాలు మెరుపుదాడి చేశాయి. అన్నారం – మర్రిమర్ల అడవుల పరిధిలో భారీ ఎన్ కౌంటర్ జరుగగా, ఆరుగురు మావోలు మరణించారు.

గ్రేహౌండ్స్ దళాళను చూసిన మావోలు తొలుత కాల్పులు ప్రారంభించగా, ఎన్ కౌంటర్ మొదలైనట్టు ప్రాథమిక సమాచారం. ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతుండగా, ఆ ప్రాంతానికి మరిన్ని బలగాలను పంపించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సివుంది.

మరోవైపు దంతెవాడ-బీజాపూర్‌ జిల్లాల సరిహద్దు గ్రామాలు అన్నారం-మర్రిమలలో గ్రేహౌండ్స్‌ దళాలు అడవిని జల్లెడపడుతున్నాయి. గడ్చిరోలి-సుక్మా ఎన్‌కౌంటర్‌లలో మృతుల సంఖ్య 40కి పైగా చేరుకున్న విషయం తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -