విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వైసిపి ఎంపీలు ఢిల్లీలో మాట్లాడటానికి భయపడి… ఇక్కడ మాత్రం ఓట్ల కోసం నిరసన ప్రదర్శనలు చేస్తామంటే ప్రజలెవ్వరూ నమ్మడానికి సిద్ధంగా లేరని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. దేశంలో ఉన్న అన్ని పరిశ్రమల్లాగే విశాఖ ఉక్కు పరిశ్రమను చూడొద్దని.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఆంధ్రుల ఆత్మగౌరవ అంశంగా చూడాలని కోరారు.
పరిశ్రమను ప్రత్యేక దృష్టితో చూడలని తనే స్వయంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చెప్పి, వినతిపత్రం ఇచ్చానని పవన్ తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంటు ఉద్యమాన్ని వైసిపి ఎంపీలు ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఏ త్యాగాలు చేస్తే పరిశ్రమ రాష్ట్రానికి వచ్చిందో కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంటు విషయంలో ప్రజలు కోరుకునే విధంగా జనసేన పార్టీ అండగా ఉంటుందని చివరి వరకు ఇదే మాట మీద ఉంటామని తేల్చిచెప్పారు.
వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం.. ఫైర్ అయిన షర్మిల!
కేరళ రాజకీయాలలో ఇంత పెద్ద అస్త్రం.. ఎవరు ఊహించలేదు..!