వైఎస్ జగన్మోన్రెడ్డిమీద దాడి జరిగిన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. శనివారం ఉదయం అమరావతినుంచి హస్తినకు బయల్దేరనున్నారు. బాబు హుటా హుటిన అస్తినకు ఎందుకు వెల్తున్నారనేది ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో ఐటీ సోదాలు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై ఎయిర్పోర్టులో దాడులు కలకలకంరేపాయి. ఈ పరిణామాల తర్వాత చంద్రాబాబు ఢిల్లీ పర్యటనకు వెళుతుండటం ఆసక్తిగా మారింది.
ఢిల్లీ టూర్లో జాతీయ పార్టీల నేతల్ని చంద్రబాబు కలవనున్నారు. ప్రధానంగా ఏపి ప్రభుత్వంపై ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ వ్యవహరిస్తున్న తీరుపై ఫిర్యాదు చేయడానకి వెల్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. జగన్పై దాడి జరిగిన వెంటనే గవర్నర్ నరశింహన్ ఏపీ డీజీపీకీ ఫోన్ చేసి వివరణ అడగడంపై బాబు గుర్రుగా ఉన్నారు.
రేపు మధ్యాహ్నం 3 గంటలకు డిల్లీలోనే జాతీయ మీడియాతో చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆయన ఈ ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడతారన్న దానిపై రాజకీయంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం గవర్నర్ నరసింహన్ కూడా డిల్లీ పర్యటనలోనే వున్నారు. ఇవాళ ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఈ సమయంలో చంద్రబాబు డిల్లీయ పర్యటనపై ప్రకటన చేయడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.