- Advertisement -
ఏపీలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది జగన్ ప్రభుత్వం. మేని ఫెస్టోలు ఇచ్చిన ప్రతీ అంశాన్ని జగన్ నెరవేర్చుకుంటూ పోతున్నారు. తాజాగా గ్రామ, వార్డు వాలంటీర్ల వ్వవస్థను జగన్ ప్రారంభించారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కొత్తగా ఎంపికైన వాలంటీర్లకు ఐడీ కార్డులు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర లక్షలమంది వాలంటీర్లను ఏపీ ప్రభుత్వం నియమించింది. ఆగస్టు 15 నుంచి గ్రామాల్లో వాలంటీర్ల సేవలు మొదలయ్యాయి.
వలంటీర్ల వ్యవస్థ ద్వారానే సంక్షేమ పథకాల అందజేత… లబ్దిదారుల గుర్తింపు ప్రక్రియ చేపట్టనుంది. పరిపాలనలో వలంటీర్లు వ్యవస్థ కీలకంగా మారనుంది. ప్రతీ వలంటీరుకు నెలకు రూ. ఐదు వేల చొప్పున గౌరవ వేతనం ఇవ్వనుంది ప్రభుత్వం. ఈ సందర్భంగా వలంటీర్లు విధి విధానాలను రూపొందించి.. రూట్ మ్యాప్ ఖరారు చేసింది సర్కార్.