- Advertisement -
కుటుంబంతో జెరూసలేం పర్యటన వెల్తున్న సీఎం వైఎస్ జగన్ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తో ప్రగతి భవన్ లో రెండో సారి భేటీ అయ్యారు. హైదరాబాద్లో ఉన్న జగన్ ముందుగా నరసింహన్తో భేటీ అయ్యారు. దాదాపు గంటసేపు గవర్నర్తో చర్చలు జరిపారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
అనంతరం కేసీఆర్ తో సమావేశ మయ్యారు. ఈ భేటీలో ఏపీ భవన్ విభజన, సొంత రాష్ట్రాలకు ఉద్యోగుల బదిలీలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఉమ్మడి మంచినీటి సమస్యలు, విభజన సమస్యలపై చర్చించినట్లు సమాచారం. వచ్చే నెలలో ఇరు రాష్ట్రాల అధికారుల భేటీకి సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.