- Advertisement -
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని పథకాల పేర్లు మారుతున్నాయి. తాజాగా మరో పథకానికి పేరు మారింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన చంద్రన్న పెళ్లి కానుక పథకం పేరును మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇకపై ఈ పథకాన్ని వైఎస్ఆర్ పెళ్లికానుకగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల పేర్లను సీఎం జగన్ మారుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకం పేరును వైయస్సార్ అక్షయపాత్రగా, ఎన్టీఆర్ భరోసా పథకాన్ని వైయస్సార్ పింఛను కానుకగా మార్చారు