చంద్రబాబు నాయుడిపై ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ ఫైర్ అయ్యారు.రివర్స్ టెండరింగ్, జగన్ అంటే బాబుకు భయమెందుకని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో రివర్స్ టెండరింగ్ లో సక్సెస్ అయ్యామని ప్రభుత్వానికి రూ.58 కోట్లు ఆదాయం వచ్చిందని ఇది ఆరంభం మాత్రమేనని తెలిపారు.
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రివర్స్ టెండరింగ్కు వైఎస్ఆర్సీపీ సర్కారు నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే.ఎడమ కాల్వ పనులకు శుక్రవారం బిడ్డింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం రూ.300 కోట్ల విలువైన పనులకు సంబంధించి టెండర్ పిలవగా, అంచనా వ్యయం కన్నా 15.6 శాతం తక్కువకు మ్యాక్స్ ఇన్ఫ్రా సంస్థ బిడ్ దాఖలు చేసింది. దీంతో ఖజానాకు దాదాపు రూ.47 కోట్ల మేర ఆదాయం వచ్చింది.
ఈ సందర్భంగా బాబుపై మంత్రి విమర్శలు గుప్పించారు.రివర్స్ టెండరింగ్ పూర్తి పారదర్శకతతో సాగుతోందని, టీడీపీ నేతలు అసత్య ప్రచారాలు మానుకోవాలని సూచించారు. ‘మీ ప్రభుత్వం హయాలో స్పిల్వే పను మాత్రమే పూర్తి చేశారు. పేద ప్రజలకు ఆర్అండ్ఆర్ను కూడా పట్టించుకోలేదని విమర్శించారు.
ఇప్పుడు మంచి ఆలోచనతో జగన్ ముందుకు వెళ్తుంటే మీకు కంటగింపుగా ఉండి విమర్శలు చేయడం తగదు’ అంటూ మంత్రి ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఖజానాకు ఆదా అవుతుంటే చంద్రబాబుకు ఎందుకంత బాధని అన్నారు. మంచి ఆలోచనతో ముందుకెల్తున్న సీఎం జగన్ ను విమర్శించడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు.