- Advertisement -
ప్రముఖ మల్టీ నేషనల్ టెక్కాలజీ దిగ్గజం యాపిల్ ఇంక్ చీఫ్ టిమ్ కుక్ భారత్ కు రానున్నారు. స్మార్ట్ ఫోన్ల మార్కెట్ లో రెండో స్దానంలో ఉన్న భారత్ లో తమ మార్కెట్ ను పెంచుకోవడంలో భాగంగా టిమ్ కుక్ భారత్ కు రానున్నారు. ఈ సందర్భంగా టిమ్ కుక్ భారత్ ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమవుతారని చెబుతున్నారు.
అయితే కుక్ పర్యటనకు సంబంధించిన వివరాలను మాత్రం ఆ కంపెనీ వెల్లడించడం లేదు. యాపిల్ ఉత్పత్తులకు భారత్ లో మంచి మార్కెట్ ఉందని సంస్ధ భావిస్తున్నారు. దీంతో కంపెనీ సిఇవో టిమ్ కుక్ తమ ఉత్పత్తులను భారత్ లో విస్తరించాలని భావిస్తున్నారు.
ఇందులో భాగంగానే కుక్ భారత్ కు వస్తున్నారని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. స్మార్ట్ ఫోన్ల వినియోగంలో భారత్ 23 శాతం పెరిగింది. దీంతో అమెరికాను తోసిరాజని భారత్ రెండో స్ధానానికి ఎగబాకింది.