Tuesday, May 14, 2024
- Advertisement -

ఆర్మీ జవాన్ ఔరంగజేబ్ హత్యకు ప్ర‌తీకారం తీర్చుకోవ‌డానికి సౌదీనుంచి తిరిగొచ్చిన 50 మంది యువ‌కులు

- Advertisement -

రంజాన్ సందర్భంగా సెలవుపై ఇంటికి వెళుతున్న ఆర్మీ జవాన్ ఔరంగజేబ్‌ను ఉగ్రవాదులు అపహరించి అత్యంత పాశవికంగా హత్యచేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న విదేశాల్లోని గ్రామస్తులు ప్రతీకారం తీర్చుకునేందుకు 50 మంది స్వస్థలానికి చేరుకున్నారు.

పూంచ్ జిల్లాలోని మెంధర్ మండలం సలాని గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ ఔరంగజేబ్ ను జూన్ లో కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు దారుణంగా హత్యచేశారు. సౌదీ అరేబియాలో ఉంటున్న ఆ గ్రామ యువకులు ఈ విషయం తెలుసుకుని తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు. తమ సోదరుడ్ని చంపినవాళ్లను మట్టుబెట్టేందుకు ఉద్యోగాలకు రాజీనామా చేసిన 50 మంది యువకులు.. అప్పటికప్పుడు స్వగ్రామానికి బయలుదేరారు.

దీనిపై మొహమ్మద్ కిరామత్ అనే యువకుడు మాట్లాడుతూ.. ‘ఔరంగజేబును ఉగ్రవాదులు చంపారని తెలియగానే నా ఉద్యోగానికి రాజీనామా చేసి, వెంటనే స్వస్థలానికి బయలుదేరా… నాలాగే దాదాపు 50 మంది యువకులు భారీ వేతనాలను వదులుకుని సలానీకి తిరిగివచ్చారు. మా అందరి లక్ష్యం ఔరంగజేబు హత్యకు ప్రతీకారం తీర్చుకోవడమే అని స్పష్టం చేశారు. ఉగ్రవాదుల్ని వేటాడేందుకు తామంతా ఆర్మీ, పోలీస్ విభాగంలో చేరుతామని ప్రకటించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -