జమ్మూకాశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేస్తూ.. మూడు ప్రాంతాలుగా విడిపోయిన తర్వాత జమ్మూకాశ్మీర్ లో ఉగ్ర కదలికలు పెద్దగా కనిపించలేదు. జమ్మూకాశ్మీర్ అంతట ప్రశాంత వాతావరణం కనిపించింది. అయితే, గత కొన్ని రోజులుగా మళ్లీ జమ్మూకాశ్మీర్ ఉగ్ర కదలికలు అధికమవుతున్నాయి. దీంతో రంగంలోకి దిగిన భద్రతా బలగాలు ఉగ్ర కలాపాలు సాగకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలోనే జమ్మూకాశ్మీర్ లోని పలు చోట్ల ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ ను భద్రతా బలగాలు చేపడుతున్నాయి. తాజాగా జమ్ముకశ్మీర్లోని బిజ్బెహరా ప్రాంతంలో ఉగ్రవాదుల ఏరివేత కోసం చేపట్టిన ఆపరేషన్ ను విజయవంతంగా ముగించామని జమ్ముకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ వెల్లడించారు. గత శనివారం జరిగిన కాల్పుల్లో టెరిటోరియల్ ఆర్మీ జవాన్ను కాల్చి చంపిన ఇద్దరు ఉగ్రవాదులను ఈ ఆపరేషన్లో మట్టుబెట్టామని తెలిపారు.
ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమంలో భాగంగా గత 72 గంటల్లో జమ్మూకాశ్మీర్లో జరిపిన వేరువేరు ఆపరేషన్లలో మొత్తం 12 మంది ఉగ్రవాదులు హతమయ్యారని దిల్బాగ్ సింగ్ వివరించారు. ఈ మొత్తం 12 మంది ఉగ్రవాదులలో త్రాల్, సోపియాన్ ఆపరేషన్లలో ఏడుగురు, హరిపొరాలోని అల్ బదర్ ఆపరేషన్లో ముగ్గురు, తాజాగా బిజ్బెహర్ ఆపరేషన్లో హతులైన ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నారని పేర్కొన్నారు.
హోం క్వారంటైన్లోకి పవన్ కళ్యాణ్ !
‘వకీల్ సాబ్’ కలెక్షన్ల సంగతి తెలుసా?
గొంతునొప్పిని ఇట్టే తగ్గించే చిట్కాలు ఇవిగో !
కరోనాతో కన్నుమూసిన నటుడు సతీష్ కౌల్
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది భక్తులు మృతి
12 terrorists neutralised so far in 4 separate operations over last 72 hrs