Thursday, April 25, 2024
- Advertisement -

నలుగురు సినిమా సెలబ్రిటీల అరెస్టు ఖాయ‌మ‌నే వార్తులు బ‌లంగా వినిపిస్తున్నాయి…

- Advertisement -

టాలివుడ్ డ్రగ్ కేసు ప్రకంపనులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికె దీనితో సంబంధం ఉన్న‌వారిని సిట్ అధికారులు విచారిస్తున్నారు.విచార‌న‌లో కొత్త కొత్త విష‌యాలు వెల్ల‌డ‌వుతున్నాయి.ఇప్ప‌టికె సీఎం కేసీఆర్ డ్ర‌గ్స్ మాఫియాను సీరియ‌స్‌గా తీసుకున్న నేప‌థ్యంలో అధికార‌లు బ‌ల‌మైన సాక్ష్యాధారాలు సేక‌రించె ప‌నిలో ప‌డ్డారు.

అయితే తెరవెనుక వేరే సంగతులు నడుస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కేసును పకడ్బందీగా తయారుచేయడానికి, అన్నీ, సకల విధాలా రెడీ చేసుకున్న తరువాతే అరెస్టులు చేయడానికి విచారణాధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

కేవలం ఇప్పటికి అరెస్టు చేసిన వారి నుంచి సంపాదించిన సాక్ష్యాలు రుజువులు కాకుండా, పోలీసులు విచారణ ద్వారా సంపాదించిన రుజువులు, సాక్ష్యాలు, అలాగే వారంతట వారు ఇచ్చిన స్టేట్ మెంట్ లు, ఇలా మొత్తం కేసును పకడ్బందీగా తయారుచేసిన తరువాత అరెస్టులు స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది.

మ‌రో వైపు విచార‌న‌లో నిందుల‌నుంచి వెట్రుల‌క‌లు,గోర్లు,ర‌క్తం లాంటి షాంపిల్స్‌ను అధికార‌లు సేక‌రించారు.వీట‌న్నింటిని ల్యాబ్ టెస్ట్‌కు పంపారు.విచార‌న ముగిసెలోగ ల్యాబ్ రిపోర్టు రానున్నాయి.ఈరిపోర్టుల‌ను మందు పెట్టుకొని అరోస్ట్ లు చేయ‌నున్నార‌నె వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి.దీనికి సంబందించి ఇప్ప‌టికె అధికారులు సంకేతాలు పంపారు.

స్టార్ డైరెక్ట‌ర్ పూరీతోపాటు కనీసం నలుగురు సినిమా సెలబ్రిటీల అరెస్టు ఖాయం అనే గుసగుసలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ అరెస్టులు అన్నీ నాలుగు లేదా అయిదో తేదీ తరువాతే వుంటాయని వార్తలు వినిపిస్తున్నాయి. అప్పటికి అన్ని విచారణలు పూర్తవుతాయని, అలాగే ల్యాబ్ రిపోర్టులు వస్తాయని తెలుస్తోంది.అన్ని సాక్ష్యాలు ప‌క‌డ్బందీగా సేక‌రించిన త‌ర్వాతె అరెస్ట్‌ల ప‌ర్యం మొద‌లుపెట్ట‌నున్నారు అధికార‌లు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -