- Advertisement -
ఆర్టికల్ 370 రద్దుతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న పాక్ భారత్ ఏదో రూపంలో తన అక్కసను తీర్చకుంటోంది. వాణిజ్య సంబంధాలను తెంచుకున్న తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తమ గగనతలంలో భారత విమానాలపై నిషేధం విధిస్తున్నామని మంగళవారం ప్రకటించింది. అఫ్గానిస్తాన్కు వెళ్లే భారత వాణిజ్య విమానాలపై కూడా నిషేధం వర్తిస్తుందని పాక్ సైన్స్, సాంకేతిక మంత్రి ఫవాద్ చౌద్రీ స్పష్టం చేశారు.
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన కేబినేట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఫవాద్ వెల్లడించారు. దీనికి సంబంధించిన న్యాయ ప్రక్రియలను పూర్తి చేస్తున్నామన్నారు.మోదీ ప్రారంభించారు.. మేం ముగిస్తాం’ అంటూ ఫవాద్ ట్వీట్చేశారు.