- Advertisement -
అయోధ్యను ప్రపంచ పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఐఐఎం ఇందోర్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది అయోధ్య మున్సిపల్ కార్పోరేషన్. రామాలయం నిర్మాణం దృష్ట్యా.. అయోధ్యను అందంగా నిర్మించేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని మున్సిపల్ కమిషనర్ విశాల్ సింగ్ తెలిపారు. ఇందోర్ మాదిరిగానే అయోధ్యను కూడా తీర్చిదిద్దాలని అభిప్రాయపడ్డారు.
ఈ ఒప్పందం ప్రకారం మున్సిపల్ సిబ్బందికి ‘స్వచ్ఛ భారత్’ కింద శిక్షణ ఇవ్వనున్నారు. అయోధ్యను స్వచ్ఛతా నగరంగా తీర్చిదిద్దనున్నారు. జనవరి 14 నుంచి ఈ ఒప్పందం అమలవుతుందని అధికారులు తెలిపారు.