- Advertisement -
కృష్ణా పుష్కరాల్లో స్నానం చెయ్యడం కోసం హిందూపురం ఎమ్మెల్యే – సినీ నటుడు బాలకృష్ణ తన సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి షెడ్యూల్ ని సైతం పక్కకి పెట్టి రావడం విశేషం .మొదటి రోజు స్నానం చాలా పవిత్రంగా భావించే ఈ ప్రాంతం లో ఆయన నిన్న రాత్రే సతీ సమేతంగా విజయవాడ చేరుకున్నారు.
గురువారం రాత్రి పవిత్ర సంగమం లో స్నానం చేసి చంద్రబాబు తో పాటు నీళ్ళలో మునిగారు. కృష్ణా నదికి ఇచ్చిన హారతిని కూడా తిలకించిన బాలయ్య నమూనా ఆలయాన్ని కూడా సందర్శించారు. ఇవాళ ఉదయం భార్య తో బావ చంద్రబాబు ఆయన సతీమణి తో కలిసి స్నానం చేసి కృష్ణా నది కి పసుపు – కుంకుమ సమర్పించారు.
ఆయన గౌతమీపుత్ర శాతకర్ణి గెటప్లోనే దుర్గాఘాట్ కు రావడంతో యాత్రికులు ఆయనను కన్నార్పకుండా చూస్తూనే ఉండిపోయారు. ఒకరకంగా పుష్కరాల్లో సెంటరాఫ్ ది ఎట్రాక్షన్ గా నిలిచారు బాలయ్య.
Related