ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో పెరిగిపోతున్న అవినీతి,నల్ల డబ్బును అరికట్టేందుకు పెద్దనోట్లను రద్దు చేయడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించారు.నోట్ల రద్దుతో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికి తెలిసందే.అయితే ఇప్పుడు మోదీ మరో షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు సమాచరం.
పన్ను ఎగవేతదారులకు చెక్ పెట్టేందుకే రూ.2వేల నోటును రద్దు చేస్తున్నట్లు వార్తులు వస్తున్నాయి.ప్పటికే వారు రూ.2వేల నోట్లను అక్రమంగా భారీ మొత్తంలో నిల్వ చేసుకున్నట్లు సమాచారం.దీనితో పాటు రూ.10, 5,2, 1 నాణేలను కూడా రద్దు చేస్తారనే వార్తలు కొన్ని మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రధానంగా నోట్ల తయారీ ఖర్చుకంటె నానేలను తయారు చేయడానికే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తోంది.అందుకే వాటని రద్దుచేసి వాటిస్థానంలో నోట్లను ప్రవేశ పెట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఉదాహరలనకు రూ.10 నాణేన్ని తయారు చేయడానికి రూ. 6.10 ఖర్చు కాగా, 10రూపాయల నోటును తయారు చేయడానికి 94పైసలు మాత్రమే ఖర్చు కావడం గమనార్హం.
{loadmodule mod_custom,GA2}
అయితే ఈ నిర్ణయాన్ని ఆర్థిక నిపుణులు వ్యతిరేకిస్తున్నారు.చిన్ననోట్లకు బదులు ….చిల్లర నానేలను చలామనిలో ఉంచాలని అభిప్రాయపడుతున్నారు.కారనం నోట్ల మనుగడ చాలా తక్కువ కాలం ఉంటుందని అదే నానేలు అయితే దీర్ఘకాలం చెలామనిలో ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.దీంతో నాణేల రద్దుపై కేంద్రం తర్జనా బర్జనా పడుతున్నట్లు సమాచారం.
{loadmodule mod_sp_social,Follow Us}
