Saturday, May 18, 2024
- Advertisement -

తృటిలో త‌ప్పించుకున్న శిల్పా…

- Advertisement -
నంద్యాల ఉప ఎన్నిక  జ‌రిగిన మ‌రు స‌టి రోజె  శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డిపై హ‌త్యాయ‌త్నం జ‌రిగింది. దీంతో అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఎన్నిక‌లో వైసీపీదే విజ‌యం అని తేల‌డంతో టీడీపీ వ‌ర్గీయులు దాడుల‌కు పాల్ప‌డ్డార‌నె ఆరోప‌న‌లు వినిపిస్తున్నాయి. నంద్యాల‌లోని సూర‌జ్ గ్రాండ్ హోట‌ల్‌వ‌ద్ద కాల్పుల సంఘ‌ట‌న చోటు చేసుకుంది.
వివ‌రాల్లోకి వెల్తే నంద్యాల కౌన్సిలర్ చింపింగ్ బాషా చనిపోవడంతో, ఈరోజు అతని అంత్యక్రియలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇరు పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇరు పార్టీలకు చెందిన వాహనాలు ఎదురెదురుగా వచ్చాయి. దీంతో, టీడీపీ నేత అభిరుచి మధుకు సంబంధించిన వాహనాన్ని పక్కకు తీయాలని శిల్పా వర్గానికి చెందినవారు కోరారు.
అభిరుచి మ‌ధు  ససేమిరా అనడంతో… ఇరువర్గాల మధ్య గొడవ ప్రారంభమైంది. ఈ క్రమంలో టీడీపీ నేత అభిరుచి మధుకు చెందిన వాహనంపై వైసీపీ శ్రేణులు రాళ్లు రువ్వాయి. దీంతో, పరిస్థితి ఒక్కసారిగా ఉద్రక్తంగా మారింది. ఈ నేపథ్యంలో దాడులకు పాల్పడుతున్నవారిని చెదరగొట్టేందుకు అభిరుచి మధు ప్రైవేట్ గన్ మెన్ గాల్లోకి ఐదు రౌండ్ల కాల్పులు జరిపాడు.
ఉద్రిక్త పరిస్థితి గురించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. అక్కడున్నవారిని పంపించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ, పరిస్థితి అదుపులోకి రాలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -