- Advertisement -
చాలామంది భూమిపైనే సొంత స్థలం కొనలేక ఇబ్బంది పడుతూంటే ఓ వ్యక్తి చంద్రుడి మీద ఏకంగా మూడెకరాలు కొని తన భార్యకు బహుమతిగా ఇచ్చాడు. వారి పెళ్లిరోజున చంద్రమండలం తాలూకు రిజిస్ట్రేషన్ కాగితాలు బహూమానంగా ఇవ్వగా ఉబ్బితబ్బిబైపోయింది ఆ ఇల్లాలు.
రాజస్థాన్లోని జైపూర్కి చెందిన ధర్మేంద్ర తన భార్యకు ఇలా పెళ్లిరోజు ఆమె ఊహించని బహుమతి ఇచ్చి ఆశ్చర్యపరిచాడు.న్యూయర్క్లోని అంతర్జాతీయ లూనా సొసైటీ ద్వారా ధర్మేంద్ర ఈ స్థలాన్ని కొనుగోలు చేశారు. కొనుగోలు వ్యవహరం పూర్తవడానికి సంవత్సరం పట్టింది.
కొన్ని నెలల క్రితం బిహార్కు చెందిన వ్యక్తి తన పుట్టిన రోజున ఒక ఎకరం స్థలాన్ని కొన్నారు. బాలీవుడ్ హీరో షారుక్ఖాన్, దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ సైతం చంద్రుడిపై ఫ్లాట్లు కొనడం విశేషం.