Saturday, May 18, 2024
- Advertisement -

తెలంగాణాలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో యూపీ ఫార్మాలాను ప్ర‌యేగించనున్న క‌మ‌ళం…

- Advertisement -
BJP chief Amit shah get up plan in telangana 2019 election

2019 ఎన్నిక‌ల్లో తెలంగాణాలో ప‌ట్టుసాధించేందుకు క‌మ‌ళం పార్టీ ప‌క్కాప్ర‌ణాలిక‌ను రూపొందిస్తోంది.ఇప్ప‌టికే ద‌క్షిణాదిపై దృష్టి సారించిన అధిస్టానం ఆదివ‌గా క‌స‌ర‌త్తులు ప్రారంభించింది.వచ్చే ఎన్నికల నాటికి ఒంటరిగా బలపడాలని ప్లాన్ వేస్తోంది.

ఇందులో భాగంగా యుపి ఫార్ములాను ఇక్క‌డే వ‌ర్క్‌వుట్ చేయాల‌ని అనుకుంటోంది. యుపిలో క్షేత్రస్థాయి ప్ర‌చారం కోసం బీజేపీలో పుల్‌టైమ‌ర్స్‌ను నియ‌మించింది. వామ‌ప‌క్షాల్లో పార్టీ వ్య‌వ‌హారాల కోసం పుల్‌టైమ‌ర్స్ ఉంటారు. కుటుంబ అవ‌స‌రాల కోసం పార్టీయే వారికి కొంత డ‌బ్బు ఇస్తుంది.

{loadmodule mod_custom,Side Ad 1}

ఎన్నిక‌ల వ్యూహాల అమ‌లులో దిట్ట‌యిన అమీత్ షా తెలంగాణ‌లో మిష‌న్ 60 కోసం 60 మంది మెరిక‌ల్లాంటి పుల్‌టైమ‌ర్స్‌ను ఎంపిక చేసింది. నియోజ‌క‌వ‌ర్గానికి ఒకరిని పార్టీ వ్య‌వ‌హారాలను చ‌క్క‌బెట్టేందుకు పార్టీ ఉప‌యోగిస్తుంది. వీరు కార్య‌క‌ర్త‌ల‌కు అందుబాటులో ఉండేందుకు వారికి యుపిలో బైకులు ఇచ్చింది.కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తోన్న ప‌థ‌కాల‌ను క్షేత్ర స్థాయిలో వివిరించేందుకు ఉప‌యేగ ప‌డున్నారు.

{loadmodule mod_custom,Side Ad 2}

ఇప్పుడు తెలంగాణ‌లో కూడా యూపీ ఫార్ములాను ఉప‌యేగించ‌నున్నార .యూపీలో ఇచ్చిన విధంగానే తెలంగాణా వారికి అలాంటీ బైకులు ఇవ్వాల‌ని అనుకుంటోంది. ఈమేర‌కు బైకులు యుపి నుంచి తెలంగాణ‌కు తీసుకొచ్చింది. అమిత్ షా ప‌ర్య‌న‌ట‌లో వారికి అంద‌జేయ‌నుంది. ఇటు ఏపీ కోసం మ‌రో 60 బీజేపీ బైకులు సిద్దం చేసింది. ఉత్తరప్రదేశ్ నుంచి తెప్పించిన బైక్ లు తెలంగాణలోని బిజెపి పార్టీ కార్యాలయానికి వచ్చాయి. ఈ బైక్ లను తెలంగాణ వ్యాప్తంగా ఎంపిక చేసిన కార్యకర్తలకు అమీత్‌షా ప‌ర్య‌ట‌న‌లో ఇవ్వ‌నున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు బిజెపి పట్ల ఆకర్షితులయ్యేలా ఎంపిక చేసిన కార్యకర్తలకు శిక్షణ ఇస్తారు. ప్రజలను బిజెపి వైపు ఆకర్షించడమే వారి పని. మ‌రి అమీత్‌షా ఉత్త‌రాది ఉపాయ‌లు ద‌క్షిణాదిన ఎంత‌మేర‌కు ప‌నిచేస్తాయో వారికే తెలియాలి.

{loadmodule mod_sp_social,Follow Us}

Related

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -