ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి ఎదురుగాలి వీస్తోంది. నాలుగు పార్లమెంట్ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతుండగా … అందులో మూడు బీజేపీ సిట్టింగ్ స్థానాలే. ఏ ఒక్కటి కోల్పోయినా బీజేపీ లోక్ సభలో మైనారిటీలో పడుతుంది. ఫలితాలను చూస్తే భాజాపాకు వ్యతిరేకంగా వస్తున్నాయి.
ఇటువంటి పరిస్థితుల్లో మూడు స్థానాల్లో బీజేపీ ఓటమి దిశగా సాగుతుండటం, ఈ మూడూ కాంగ్రెస్ బలపరిచిన పార్టీల ఖాతాల్లోకి చేరనుండటంతో లోక్ సభలో బలాబలాల నంబర్ మారిపోనుంది. కైరానా, పాల్ ఘడ్, బండారా-గోందియాలు బీజేపీ సిట్టింగ్ స్థానాలుకాగా, కైరానాను ఇప్పటికే బీజేపీ కోల్పోయింది. పాల్ గఢ్ లో ఎన్సీపీ ఆధిక్యం కొనసాగుతుండగా, భండారా-గోందియా మాత్రం బీజేపీ కైవసమయ్యేలా ఉంది.
ప్రస్తుతం లోక్సభలో భాజాపాకు కైరానా, పాల్ ఘడ్, బండారా-గోందియాలు బీజేపీ సిట్టింగ్ స్థానాలుకాగా, కైరానాను ఇప్పటికే బీజేపీ కోల్పోయింది. పాల్ గఢ్ లో ఎన్సీపీ ఆధిక్యం కొనసాగుతుండగా, భండారా-గోందియా మాత్రం బీజేపీ కైవసమయ్యేలా ఉంది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఏపార్టీ అయినా అవిశ్వాస తీర్మానం పెడితే ప్రభుత్వాన్ని కాపాడుకొనేందుకు భాజాపా మిత్రపక్షాల సహాయం తీసుకోక తప్పదు. ఇప్పటికే మిత్ర పక్షాలన్ని దూరంగా ఉన్నాయి.