ప్రణబ్ ముఖర్జీ తరువాత రాష్ట్రపతి ఎవరనేదానిపై దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ ఉత్కంటకు తెరపడింది.మోదీ తన మ్యాజిక్ పవర్ను చూపించడంతో పార్టీలు షాక్కు గురయ్యారు.ఇప్పటి వరకు పోటీలోలేని వ్యక్తని రాష్ట్రపతిగా భాజాపా ఛీప్ అమీత్షా దళిత నాయకున్ని తమ రాష్ట్రపతి అభ్యర్తిగా ప్రకటించారు.
ప్రతి పక్షాలకు షాక్ ఇచ్చేవిధంగాఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా బిహార్ గవర్నర్ రామనాథ్ కోవింద్ పేరు ఖరారు చేసినట్టు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరుల సమావేశంలో కోవింద్ పేరును ప్రకటించారు.
{loadmodule mod_custom,GA1}
రాష్ట్రపతి అభ్యర్తి పదవికి ప్రతిపక్షపార్టీలు తమ అభ్యర్తిని నిలుపుతామని ప్రకటించడంతో భాజాపా ఆందోళనలో ఉంది.పోటీలేకుండా ఏకగ్రీవంకోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.ఎక్కడా వ్యతిరేకత రాకుండా ఎవరూ ఊహించని విధంగా అనూహ్యంగా రామనాథ్ పేరును తెరపైకి తెచ్చి బీజేపీ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎన్డీఏ పక్షాలు సైతం ఆయన పేరును ఊహించలేకపోయాయి.
దళిత నాయకుడైన రామనాథ్ స్వస్థలం ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ సమీపంలో ఉన్న డేరాపూర్. 1945, అక్టోబర్ 1న జన్మించిన ఆయన జన్మించారు. వృత్తిరీత్యా ఆయన న్యాయవాది. 1994-2006 మధ్య కాలంలో రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. 2015 నుంచి బిహార్ గవర్నర్గా ఉన్నారు. గతంలో బీజేపీ దళిత మోర్చా అధ్యక్షుడిగా నాలుగేళ్లు పనిచేశారు.
{loadmodule mod_custom,GA2}
ఎన్డీఏ రాస్ట్రపతి అభ్యర్తిగా దళిత నాయకున్ని ప్రకటించి వ్యతిరేకత రాకుండా చూసుకున్నారు.ఇటు ప్రతి పక్షాలుకూడా వ్యతిరేకించకుండా…..దళితుల మద్దతును కూడగట్టారు.
{loadmodule mod_sp_social,Follow Us}