బ్లాక్ బక్స్ను వేటాడిన కేసులో విచారణకు సల్మాన్ ఖాన్ జోధ్పూర్ కోర్టుకు శిక్షను ఖరారు చేసింది. దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి విచారణలో ఉన్న ఈకేసులో తీర్పు వెలువడంది. ఐదు సంవత్సరాల జైలుశిక్షతో పాటు రూ. 10వేల జరిమాణా విధించింది.
కోర్టు శిక్షకరారు చేసే సమయంలో కండలవీరుడి మాజీ ప్రియురాలు కత్రినాకైఫ్ ముంబైలోని సిద్ధివినాయక టెంపుల్ను సందర్శించడం ఆసక్తిదాయకంగా నిలిచింది. కేసు విచారణ నేపథ్యంలో సల్మాన్ కోసం పూజలు చేయడానికే కత్రినా ప్రసిద్ధ సిద్ధి వినాయక ఆలయానికి వచ్చిందని స్పష్టం అవుతోంది. కత్రినాతో పాటు సల్మాన్ ఖాన్ చెల్లెలు అర్పితా ఖాన్ ఉండటమే దీనికి రుజువు.
అయితే కత్రినా పూజలు ఫలించలేదు. దేవుడు కూడా మాజీ ప్రియుడిపై దయ చూపలేదు. అయినప్పటికీ కోర్టు మాత్రం తన పని తాను చేసుకుపోయింది. మరోవైపు ఈ కేసులో టబు, సైఫ్ అలీ ఖాన్, సొనాలీబింద్రేలను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.