ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించిన శివ భక్తులకు ఇకపై చిన్న శివలింగాలను అందుబాటులో ఉంచనున్నారు. ఇది మాత్రమే కాదు ఈ పుణ్యక్షేత్రంలో ఉన్న ఆదిగురు శంకరాచార్యుల సమాధిని భక్తులు పూర్తిగా చూసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు అక్కడ అభివృద్ధి పనులు చేపట్టారు అధికారులు. ఈ క్రమంలోనే పునరుద్ధరిస్తున్న మూడు గుహల్లో భక్తులు ధ్యానం కూడా చేసుకోవచ్చు.
నలుపు, తెలుపు రంగుల్లో త్రిశూలదారుడి లింగాలు భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. 2021లో కేదార్నాథ్ యాత్ర ప్రారంభమైనప్పటికే… దేశ, విదేశాల నుంచి వచ్చిన భక్తులకు తక్కువ ధరకే ఆలయానికి వచ్చే మార్గంలో వివిధ దుకాణాల్లో ఇవి లభించునున్నట్లు అధికారులు తెలిపారు.
కేదార్నాథ్ స్థానిక యువతకు ఉపాధి కల్పించడానికి, ఆధ్యాత్మికతను పెంపొందించడానికి పీఎం మోదీ ‘వోకల్ ఫర్ లోకల్ క్యాంపెయిన్’కు అనుగుణంగా ఈ శివలింగాల తయారీ చేపట్టినట్లు వుడ్ స్టోన్ కంపెనీ మేనేజర్ మనోజ్ సెమ్వాల్ తెలిపారు.
అబుదాబిలో తొలిసారిగా రూపుదిద్దుకుంటోన్న హిందూ ఆలయం..!
హారతి సమయంలో ఈ గుళ్లో దేవుడు కళ్లు తెరుస్తాడని తెలుసా?