- Advertisement -
ఓటుకు నోటు కేసులో ఏసీబీ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే పలువురు టిడిపి లీడర్స్ని విచారించిన ఏసిబి, తాజాగా తెలుగు యువత నాయకుడు ప్రదీప్కు ఏసీబీ అధికారులు 160 సెక్షన్ కింద ఆదివారం నోటీసులు జారీ చేశారు. అమీర్పేటలోని ఓ
అపార్ట్మెంట్లో ఉంటున్న ప్రదీప్ నివాసానికి అధికారులు వెళ్లి నోటీసులు అందచేశారు. సోమవారం ఉదయం 10-30 గంటలకు బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాయంలో విచారణకు హాజరు కావాలని అధికారులు నోటీసులో పేర్కొన్నారు..
నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ఓటు కొనుగోలు విషయంలో టిటిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఏసిబి అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.