Friday, April 26, 2024
- Advertisement -

హై కోర్టు లో చంద్ర బాబు పోరాటం..!

- Advertisement -

రాజధాని అసైన్డ్‌ భూముల వ్యవహారంలో సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను సవాల్‌ చేస్తూ తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ దాఖలు చేశారు. సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌పై రేపు హైకోర్టులో విచారణ జరిగే అవకాశముంది.

అమరావతి అసైన్డ్‌ భూముల వ్యవహారంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు… ఎస్సీ ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టం కింద చంద్రబాబు మీద సీఐడీ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని సీఆర్‌పీసీలోని 41(ఏ)(1) ప్రకారం సీఐడీ నోటీసులిచ్చింది.

అందులో పేర్కొన్న అంశాలకు కట్టుబడి ఉండకపోయినా, విచారణకు హాజరు కాకపోయినా చట్ట ప్రకారం అరెస్టు చేయాల్సి ఉంటుందని వివరించింది. ఈనెల 23న ఈ నెల 23న ఉదయం 11 గంటలకు విజయవాడలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి విచారణకు రావాలని సీఐడీ సైబర్‌ సెల్‌ విభాగం డీఎస్పీ ఎ.లక్ష్మీనారాయణ పేరిట ఈ నోటీసులు జారీ అయ్యాయి.

తెలంగాణ బ‌డ్జెట్‌ ప్ర‌వేశ పెట్టిన హ‌రీశ్ రావు.. రూ.2,30,825.96 కోట్లు!

రెజ్లర్ రితిక ఫొగట్ ఆత్మహత్య

తెలంగాణలో ఆ క్లాస్ విద్యార్థులందరినీ పాస్ చేస్తారా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -