- Advertisement -
ఇరు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ హైదరాబాదులోని రాజ్ భవన్ లో ఈరోజు ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు దూరంగా ఉన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వైసీపీ అధినేత జగన్, పవన్లకు ఆహ్వానాలు పంపారు గవర్నర్. ఈ తేనీటి విందు కార్యక్రమానికి కేసీఆర్, పవన్ కల్యాణ్, టీకాంగ్రెస్ నేతలు హాజరుకానున్నారు. జగన్ ప్రస్తుతం హైదరాబాదులో ఉండటంతో… ఆయన కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ప్రతీసారి హాజరయ్యే బాబు ఈసారి హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది.