Thursday, April 18, 2024
- Advertisement -

సాక్షి చదవొద్దు అని చెబుతాడు కానీ బాబు మాత్రం చదువుతాడు 

- Advertisement -
Caught on Camera: Chandrababu Naidu Reading Sakshi News Paper

ఏపీ సీఎం నారాచంద్ర‌బాబునాయుడుకి సాక్షిప‌త్రిక  పేరు వింటే  ర‌గిలిపోతాడు. నిత్యం ప‌త్రిక మీద త‌న అక్క‌సును వెల్ల‌గ‌క్కుతూనే ఉంటారు. ఇది రాష్ట్రంలోని ప్ర‌జ‌లంద‌రికీ తెలిసిందే. త‌న‌కు వ్య‌తిరేకంగా సాక్షిమీడియాలో ఏవార్త‌లు వ‌చ్చినా  స‌హించ‌రు.

ప‌త్రిక‌లు ఉన్న‌ది ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెల్ల‌డానికి… ప్ర‌భుత్వం వైఫ‌ల్యాల‌ను ప్ర‌జ‌ల‌కు చెప్ప‌డానికి.  కొన్ని సంర్భాల్లో ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన స‌మ‌స్య‌ల‌పై ప్ర‌భుత్వాలు స్పందించిన సంధ‌ర్భాలు ఉన్నాయి.ఒక్కోసారి స‌హ‌నం కోల్పోయిన చంద్ర‌బాబు మీడియా స‌మావేశాల్లో సాక్షిప‌త్రిక చ‌ద‌వొద్ద‌ని పార్టీ నేత‌ల‌కు ,ప్ర‌జ‌ల‌కు చెప్పిన సంద‌ర్భాలు చాలా ఉన్నాయి. ఏకంగా సాక్షిప‌త్రిక విలేక‌ర్ల‌ను త‌న కార్య‌క్ర‌మాల‌కు రావ‌ద్ద‌ని బ‌హిస్క‌రించిన సందర్భాలు ఉన్నాయి. త‌న‌కు అనుకూలంగా వార్త రాసే ప‌త్రిక‌ల‌మీద ఒక్క మాట అన‌ని చంద్ర‌బాబు సాక్షి ప‌త్రిక అంటే ఎందుకు అక్క‌స‌ని ప్ర‌జ‌లు చెవులు కొరుక్కొంటున్నారు.ప్ర‌జా స్వామ్య దేశంలో ఏప‌త్రిక నైనా చ‌దివే హ‌క్కు ప్ర‌జ‌ల‌కు ఉంది…మ‌రి త‌న‌కు వ్య‌తిరేకంగా వార్త‌లు రాసిన ప‌త్రిక‌ను చ‌ద‌వ‌ద్ద‌నే హ‌క్కు ఎవ‌రికీ లేదు.

పైపైన వ‌ల్ల‌మాలిన  తీతులు చెప్పే చంద్ర‌బాబు మాత్రం త‌న పీడ్ బ్యాక్‌కోసం మాత్రం సాక్షి ప‌త్రికలో వ‌చ్చే క‌థ‌నాల‌మీద‌నే ఆధార‌ప‌డ‌తార‌ని పార్టీ ముఖ్య నాయ‌కులు చెబెతుంటారు.ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీనాయ‌కులు చెప్ప‌డ‌మే త‌ప్పా  బ‌హిరంగంగా చూసింది ఎవ‌రూలేరు.గుర‌వింద త‌న న‌లుపు ఎర‌గ‌న‌ట్టు నీతులు చెప్పే చంద్ర‌బాబు ఇప్పుడు సాక్షిప‌త్రిక‌ను చ‌దువుతూ అడ్డంగా బుక్క‌య్యారు. ఇటీవలి కాలంలో పార్టీ నాయకులతో జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించిన సందర్భంలోనూ ఒక్కో నాయకుడి పనితీరును బేరీజు వేయడానికి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేశ్ సైతం సాక్షి పత్రిక క్లిప్పింగ్స్ చూపించి నాయకులకు రేటింగ్ ఇచ్చారని తెలిసింది. సాక్షిని చదవొద్దని పైకి చెప్పే చంద్రబాబు తీరిక దొరికినప్పుడల్లా ఆ పత్రికను తప్పనిసరిగా చదువుతారని టీడీపీ సీనియర్లు చెప్పే విషయం రూఢీ అయింది.

తాజాగా  పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి మంగళవారం ఉదయం విశాఖపట్నం వెళ్లిన చంద్రబాబు నాయుడు ఎయిర్ పోర్టు నుంచి బ్రిక్స్ సమావేశంలో పాల్గొనడానికి కాన్వాయ్ లో వెళుతున్న సందర్భంలో సాక్షి పత్రికనుచ‌దువుతున్న పోటోలు ఇప్పుడు మీడియాలో వైర‌ల్‌గా మారాయి. మొదటి పేజీ నుంచి చివరి వరకు ఆసాంతం చూస్తూ తనకు అవసరమైన కథనాలు చదివారంట‌. దాంతో పాటు జిల్లా టాబ్లాయిడ్ను సైతం పూర్తిగా చదివారు. చంద్రబాబుతో పాటు ఆ వాహనంలో జిల్లా కలెక్టర్ కూడా ఉన్నారు. ఇలాంటి సందర్భాల్లో చంద్రబాబు వాహనంలో అధికారులు అన్ని పత్రికలను అందుబాటులో ఉంచుతారు. విశాఖ పర్యటన సందర్భంగా అన్ని పత్రికల్లోనూ ఒక్క సాక్షిని మాత్రమే తీసుకుని చదివారు.దీన్ని బ‌ట్టిచూస్తే  సాక్షిప‌త్రిక‌ను మీరెవ‌రూ చ‌ద‌కొద్ద‌ని …..నేను మాత్ర‌మే చ‌దువుతాన‌న‌డం న్యాయ‌మా బాబుగారు. ఇప్పుడు ప్ర‌జ‌ల‌కు, నాయ‌కుల‌కు ఏంచెప్తారు..!

Also Read

  1. కేటీఆర్ చేయలేనిది లోకేష్ చేయగలడా…!
  2. బాబుకు కేంద్ర ఝుల‌క్‌….పోల‌వ‌రం అంచ‌నాలు పెరిగితే రాష్ట్ర‌మే భ‌రించాల‌న్న కేంద్రం
  3. బాబుకు త‌ల‌నొప్పిగా మారిన నంద్యాల ఉప ఎన్నిక‌ల‌.. పార్టీ మారే యేచ‌న‌లోశిల్పామోహ‌న్‌రెడ్డి
  4. ఇర‌కాటంలో జ‌న‌సేన‌…. పవన్ చూపుఎటూ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -