ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరులో ని పరేడ్ గ్రౌండ్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరైన తొలి అధికారిక కార్యక్రమం. సార్వత్రిక ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగి.. ఓటమిపాలైన వైసీపీ నేత ఇక్బాల్ను ఎమ్మెల్సీ చేస్తామని తెలిపారు.
సార్వత్రిక ఎన్నికల్లో ఐదుగురు ముస్లింలకు టికెట్లు ఇచ్చాం… నలుగురు గెలిచారు.. హిందూపురంలో మాత్రం ఇక్బాల్ ఓడిపోయారు.. ఆయనను ఎమ్మెల్సీని చేస్తామని హామీ ఇచ్చారు సీఎం వైఎస్ జగన్. జగన్ ఎమ్మెల్సీగా మొదటిసారి ఇక్బాల్ను ప్రకటించారు.మరోవైపు మాజీ సీఎం చంద్రబాబుపై సెటైర్లు వేశారు ఏపీ సీఎం.. 23 మంది ఎమ్మెల్యేలను డబ్బులిచ్చి కొనుగోలు చేసిన టీడీపీకి ఆ దేవుడు రాసిన రాత ఇది 23వ తేదీన ఫలితాల్లో 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారని ఎద్దేవా చేశారు