Sunday, May 5, 2024
- Advertisement -

చిరంజీవి వాళ్లకు పూర్తిగా దూరం అయినట్టే!

- Advertisement -

ఇన్ని రోజులూ చిరంజీవి కాంగ్రెస్ పార్టీ మీటింగుల్లో కనిపించేవాడు. ఆవేశంగా ప్రసంగించాడాలు.. ప్రభుత్వాలపై విరుచుకుపడటాలూ లేవు కానీ..

ఏదో నామమత్రంగా చిరంజీవి  కాంగ్రెస్ పార్టీ మీటింగులకు హాజరయ్యేవాడు. ఎంపీ బాధ్యతల్లో ఉన్నందుకు అలా కనిపించే వాడు. అయితే గత కొన్ని రోజులుగా ఆయన పార్టీ కార్యక్రమాలను పట్టించుకోవడం పూర్తిగా మానేసినట్టుగా ఉన్నాడు. ఏదో నామినల్ గా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్స్ లో పాల్గొనడం మానేశాడు!

కాంగ్రెస్ పార్టీకి ఏపీ శాసన సభలో ఉనికి లేకుండా పోయిన తరుణంలో.. ఆ పార్టీ ఏపీ విభాగం అధ్యక్షుడు రఘువీరారెడ్డి అడపాదడపా ఏవో కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నాడు. తెలుగుదేశంపై విరుచుకుపడుతూ.. చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజలను తప్పుడు హామీలతో మోసం చేశాడని అంటూ  రఘువీరారెడ్డి విరుచుకుపడుతుంటాడు. ఆ కార్యక్రమాల్లో చిరంజీవి కూడా కనిపిస్తూ ఉండేవాడు. అయితే ఇప్పుడు చిరంజీవి వాటికి కూడా దూరం అయ్యాడు.

చిరంజీవిరాజకీయాలకు పూర్తిగా దూరం కావాలని కొన్ని రోజుల నుంచి అనుకొంటున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు దానికి కట్టుబడి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని పూర్తిగా మానేస్తున్నాడాయన. ఏదో ఒక ప్రోగ్రామ్స్ ను ఫిక్స్ చేసి… ఆ ప్రోగ్రామ్ కు చిరంజీవిని ఆహ్వానిస్తూ కాంగ్రెస్ నేతలు ఎవరైనా ఫోన్ చేసినా.. ఆయన ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకొంటున్నాడు. దీంతో చేసేది లేక కాంగ్రెస్ లో మిగిలిన నేతలు ఆ కార్యక్రమాలను తూతూ మంత్రంగా ముగిస్తున్నారు. ఈ విధంగా చిరంజీవి తన రాజకీయ పర్వానికి ముగింపును ఇస్తున్నట్టేనేమో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -