- Advertisement -
విజయవాడ బెంజ్ సర్కిల్లో సీఎం జగన్ చేతుల మీదుగా.. రేషన్ సరకుల పంపిణీ వాహనాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 1 నుంచి ఇంటి వద్దకే చౌక డిపో సరకులు పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే ఈ విధానం శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలవుతోంది.
539 కోట్ల రూపాయల వ్యయంతో.. 9,260 వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. నిరుద్యోగులకు 60 శాతం సబ్సిడీతో వాహనాలను అందజేశారు. ఒక్కో వాహనం ద్వారా రోజుకు సగటున 90 ఇళ్లకు సరుకులు పంపిణీ చేయనున్నారు.
స్థానిక ఎన్నికల నిర్వహణపై ఏపీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. పంచాయతీ ఎన్నికలు కొనసాగించాలని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్నికలపై స్టే విధిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ఎస్ఈసీ దాఖలు చేసిన రిట్ అప్పీల్ను హైకోర్టు అనుమతించింది.