Thursday, April 25, 2024
- Advertisement -

వీధి దీపాల ఇబ్బందా.. అయితే ఈ యాప్ లో ఫిర్యాదు చేయండి..!

- Advertisement -

గ్రామాల్లో ఎల్​ఈడీ వీధి దీపాలపై ఫిర్యాదులను నమోదు చేయటానికి మెుబైల్ యాప్​ను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. టోల్ ఫ్రీ నంబరును కూడా ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. ఎల్​ఈడీ వీధి దీపాల నిర్వహణపై పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

గ్రామాల్లో ఎల్​ఈడీ వీధి దీపాలపై ఫిర్యాదులు అందిన 48 గంటల్లోగా సమస్య పరిష్కరించాలని మంత్రి చెప్పారు. వీధి దీపాల నిర్వహణ బాధ్యత పంచాయతీ కార్యదర్శులదే అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ వాలంటీర్లు భాగస్వాములు కావాలని దిశానిర్దేశం చేశారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఎనర్జీ అసిస్టెంట్లను భాగస్వామ్యం చేయాలని మంత్రి సూచించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -