- Advertisement -
సరైన ధ్రువ పత్రాలు చూపకపోవడం వల్ల 8 మంది రోహింగ్యాల్ని.. ఢిల్లీపోలీసులు అరెస్టు చేశారు. వారంతా ఢిల్లీలోని వివిధ ప్రాంతాలలో అక్రమంగా ఉంటున్నారని పోలీసులు తెలిపారు.కాగా తూర్పు ఢిల్లీలో అరెస్టైన ఆరుగురిలో ముగ్గురు మైనర్లు ఉన్నారని పేర్కొన్నారు. ఆనంద్విహార్ రైల్వే స్టేషన్ వద్ద వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారిని నిర్బంధ క్యాంపులకు తరలించామని వెల్లడించారు.
ద్వారకా జిల్లా ఉత్తమ్ నగర్లో అక్రమంగా ఉంటున్న ఇద్దరు రోహింగ్యాలను అర్థ రాత్రి అరెస్టు చేశామని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. వారిపేర్లు హమీద్ హుస్సేన్(23), నబీ హుస్సేన్ అని వెల్లడించారు. ఆ ఇద్దరు నిందితులు నవంబర్1న బంగ్లాదేశ్ సరిహద్దు ద్వారా భారత్లోకి ప్రవేశించారని తెలిపారు. వారివద్ద పాస్పోర్టు, వీసా లేవన్నారు.