Saturday, April 27, 2024
- Advertisement -

మళ్ళీ తెర పైకి వివాదం..రోహింగ్యాల్ని అరెస్ట్ చేసిన పోలీసులు..!

- Advertisement -

సరైన ధ్రువ పత్రాలు చూపకపోవడం వల్ల 8 మంది రోహింగ్యాల్ని.. ఢిల్లీపోలీసులు అరెస్టు చేశారు. వారంతా ఢిల్లీలోని వివిధ ప్రాంతాలలో అక్రమంగా ఉంటున్నారని పోలీసులు తెలిపారు.కాగా తూర్పు ఢిల్లీలో అరెస్టైన ఆరుగురిలో ముగ్గురు మైనర్​లు ఉన్నారని పేర్కొన్నారు. ఆనంద్​విహార్​ రైల్వే స్టేషన్​ వద్ద వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారిని నిర్బంధ క్యాంపులకు తరలించామని వెల్లడించారు.

ద్వారకా జిల్లా ఉత్తమ్​ నగర్​లో అక్రమంగా ఉంటున్న ఇద్దరు రోహింగ్యాలను అర్థ రాత్రి అరెస్టు చేశామని ఓ సీనియర్​ పోలీసు అధికారి తెలిపారు. వారిపేర్లు హమీద్​ హుస్సేన్​(23), నబీ హుస్సేన్​ అని వెల్లడించారు. ఆ ఇద్దరు నిందితులు నవంబర్​1న బంగ్లాదేశ్​ సరిహద్దు ద్వారా భారత్​లోకి ప్రవేశించారని తెలిపారు. వారివద్ద పాస్​పోర్టు, వీసా లేవన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -