Friday, May 3, 2024
- Advertisement -

అత్తా – కోడలు మధ్యలో వచ్చిన మామగారు మృతి

- Advertisement -

అత్తా కోడళ్ళ మధ్య గొడవలు రోజూ అందరి ఇళ్ళలో సర్వసాధరణం గా జరుగుతూ ఉంటాయి. పెళ్ళైన కొత్తల్లో ఇవి మామూలుగా తలెత్తి కొన్నాళ్ళకి సర్దు మనుగుతాయి లేదా ఇంకా హెచ్చుతాయి. 

ఈ తరుణంలో మియాపూర్ లో కొత్తగా పెళ్ళైన కోడలితో అత్త గొడవపడుతూ ఉండడం తో నచ్చ చెప్పడం కోసం మధ్యలో వచ్చిన మామ ని కోడలు నేట్టేయడం తో ఆయన తలకి బలమైన గాయం తగిలి మరణించాడు. 

ఈ సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి లో జరిగింది. ఎస్సై భరత్ నాయుడు చెప్పిన దాని ప్రకారం గోకుల్ ప్లాట్స్ లో కృష్ణా రావ్ ఆయన భార్య సుశీల తో ఉంటున్నారు. వారి కుమారుడు గోపీ నాథ్ , కోడు నళినీ లతో కలిసే వారు ఉంటున్నారు. సుశీల, కోడలు నళినీ గొడవ బాగా గొడవలు పడుతూ ఉండేవారు, పెళ్ళైన సమయం నుంచే వారి ఇద్దరికీ పడ్డం లేదు అని స్థానికులు చెబుతున్నారు. 

వేరు కాపురం కోసం భార్య బలవంతం పెట్ట్టడం తో ఆ పని మీదనే గోపీ ఇల్లు కోసం తిరగడం మొదలు పెట్టాడు. ఈ మధ్యలో మళ్ళీ అత్తా కోడళ్ళు కొట్టుకోవడం మొదలు పెట్టడం తో వారిని ఆపబోయిన మామ కృష్ణారావు ని కోడలు బలంగా నెట్టేసింది దీంతో ఆయన తల గోడకి తగిలి గట్టిగా గాయం అయింది. ఆయన ఆసుపత్రికి తీసుకుని వెళ్ళే మార్గం లో చనిపోయాడు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -