చైనాలో ఆర్థిక నేరాలకు పాల్పడిన ఓ సంస్థ మాజీ అధినేతకు మరణశిక్ష విధించింది ఆ దేశ న్యాయస్థానం. అవినీతి సహా రెండో వివాహం చేసుకున్న కేసులో చైనా హురంగ్ అసెట్ మేనేజ్మెంట్ కో లిమిటెడ్ మాజీ అధినేత లై జియామిన్కు ఈ శిక్ష విధించింది రెండో మునిసిపల్ ఇంటర్మీడియట్ పీపుల్స్ కోర్ట్ ఆఫ్ టియాంజిన్. అతని రాజకీయ హక్కులు రద్దు చేయడమే కాకుండా.. ఆస్తులను జప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
2008 నుంచి 2018 వరకు పలు కీలక పదవుల్లో విధులు నిర్వహించిన లై అవినీతికి పాల్పడినట్లు కోర్టు నిర్ధరించింది. 1.78 బిలియన్ యువాన్ల (దాదాపు 276 మిలియన్ డాలర్లు) అక్రమాలకు పాల్పడినట్లు తేల్చింది.
జియామిన్పై 2018లో అవినీతి కేసులో దర్యాప్తునకు ఆదేశించింది అధికార కమ్యూనిస్ట్ పార్టీ. అదే ఏడాది పార్టీ నుంచి బహిష్కరించింది.
లాక్ డౌన్ చాలా నేర్పించింది : రవితేజ
ఏ రాష్ట్రానికి ఎన్ని ఆక్సిజన్ ప్లాంట్లు ఇచ్చారంటే…!