ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లల్లో సహనం లేకుండా పోతోంది. వారు అనుకున్నది దక్కకపోతే ఎంతటి దారుణానికైనా వడిగట్టడానికి సిద్దమవుతున్నారు. దీపావళికి షాపింగ్ తీసుకెల్లలేదని పక్కింటి వ్యక్తిపై దురాగతానికి వడిగట్టాడు యువకుడు. ఈ సంగటన ఢిల్లీలో చోటు చేసుకున్న సంగటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
దేశ రాజధానిలోని జహంగీర్ పురిలో యోగేశ్ అనే యువకుడు ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో పక్కింట్లో ఉంటున్న దీపక్ తో అతనికి స్నేహం ఏర్పడింది. ఈ క్రమంలో దీపక్ దీపావళీకి టపాసులు, ఇతర వస్తువులు కొనేందుకు మార్కెట్కు బయలుదేరాడు. ఇంతలో యోగేశ్ వెంటనే తాను వస్తానని మారాం చేసి గొడవ పడ్డాడు. దీపక్ అందుకు ససేమిరా అనడంతో యోగేశ్ అక్కడి నుంచి వెళ్లపోయాడు.
పగ పెంచుకున్న యోగేశ్ ఎలాగైనా దీపక్ను చంపాలని నిర్ణయించుకున్నారు. అందుకు తగిన సమయం కోసం వేచి చూస్తుండగా గురువారం రాత్రి 11.40 సమయంలో దీపక్ను కత్తితో పొడిచి కిరాతకంగా హతమార్చాడు . అనంతరం ఘటనాస్థలి నుంచి పరారయ్యాడు. రక్తపు మడుగులో పడి ఉన్న దీపక్ ను గుర్తించిన స్థానికులు, పోలీసులకు సమాచారం అందించారు. దీపక్ ను అధికారులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యోగేశ్ను అదుపులోకి తీసుకున్నారు.