భార్య భర్తల మధ్య శృంగారం అనేది అతి సున్నితమైన అంశం.శృంగారం అనేది ఇద్దరి అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది.అయితే ఈ మధ్య పని ఒత్తిడిల కారణంగా కొన్ని కుటుంబాలలో శృంగారం మీద పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.దీంతో కుటంబలలో కలహాలు మొదలవుతున్నాయి. ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్లడంతో ఢిల్లీ హైకోర్టు దీనిపై సంచలన తీర్పు ఇచ్చింది.వైవాహిక జీవితంలో భార్యభర్తలు ఇద్దరూ తమకు నచ్చనప్పుడు శారీరక సంబంధాలకు నో చెప్పే హక్కు ఉంటుందని కోర్టు పేర్కొంది.
భర్త అడిగినప్పుడల్లా ఓకే అనాల్సిన అవసరం లేదని.. భార్య సమ్మతితోనే శృంగార సంబంధాన్ని భర్త కలిగి ఉండాలని ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు.శృంగారం భార్య అనుమతి ఇష్టంతోనే చేయాలే తప్పించి.. భయపెట్టి.. బెదిరించి.. బలవంతంగా చేయటం నేరమన్న విషయాన్ని ప్రతి భర్త గుర్తుంచుకోవాలి.దీంతో కొందరు కట్టుకున్న భార్యే శృంగారం వద్దంటే తమ బాధ ఎవరికి చెప్పుకోవాలి అని ఆవేదన చెందుతున్నారు.