Saturday, May 18, 2024
- Advertisement -

ఢిల్లీవాసుల‌కు డాక్ట‌ర్ల హెచ్చ‌రిక‌….

- Advertisement -

దేశ రాజధాని నగరంలో వరసగా మూడోరోజు కూడా కాలుష్యపొగ కమ్మేసింది. విషవాయువుల కౌగిలిలో ఢిల్లీ అతలాకుతలమవుతోంది. నిన్నొద‌ల బొమ్మాలి అంటూ ఢిల్లీని కాలుష్యం వెంటాడుతోంది. కాలుష్య స్థాయి ప్రమాదకరస్థాయిని మించి నమోదైందని తాజా రిపోర్టుల గుణాంకాలు వెల్ల‌డిస్తున్నాయి.

కాలుష్యాన్ని కొలిచే చార్టులో సున్నా నుంచి 500 వరకూ రీడింగ్ ఉంటుంది. ఇక ఆ రీడింగ్ 100 దాటితే ప్రమాదకర స్థాయికి కాలుష్యం చేరినట్టు. 400 దాటితే ఊపిరితిత్తులకు ప్రమాదకారకం. రెండు రోజుల నాడు 471కి వెళ్లిన ఈ రీడింగ్ ఇప్పుడు మరింతగా పెరిగి 726 స్థాయికి చేరింది. ఊపిరితిత్తులను నాశనం చేసి, శ్వాస కోశ వ్యవస్థను దెబ్బతీసే పీఎం (పర్టికులేట్ మ్యాటర్) 2.5 ఢిల్లీ వాతావరణంలో ఉన్న గణాంకాలివి. యూఎస్ ఎంబసీలోని పొల్యూషన్ మానిటర్ ఈ గణాంకాలను వెల్లడించింది.

ఈ పీఎం ఉన్న గాలిని పీల్చడం మానవాళికి అత్యంత ప్రమాదకరమని, తక్షణం ఢిల్లీని వదిలి వెళితేనే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని టాప్ డాక్టర్స్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ కాలుష్యం బారిన పడకుండా ఉండేందుకు ఢిల్లీ వాసులు ఎయిర్ ప్యూరిఫయర్లను, ఫిల్ట్రేషన్ మాస్క్ లను కొనుగోలు చేస్తున్నారు.

ఇప్పుడున్న కాలుష్యం స్థాయి గత మూడున్నర దశాబ్దాల్లో ఎన్నడూ కనిపించలేదని సర్ గంగారామ్ ఆసుపత్రి లంగ్ సర్జన్ అరవింద్ కుమార్ వ్యాఖ్యానించారు. ఓ డాక్టరుగా, తన అభిప్రాయం ప్రకారం, పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని అభిప్రాయపడతున్నానని, ప్రజలను రక్షించాలంటే, వారిని ఢిల్లీ దాటించడమే ఉత్తమమని, అన్ని పాఠశాలలు, ఆఫీసులు మూసివేయాలని, రహదారులపైకి ట్రాఫిక్ ను అనుమతించరాదని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -