- Advertisement -

రైతన్నల కోసం కదిలిన ఢిల్లీ అధిపతి..!

- Advertisement -

వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో చేపట్టిన రైతుల ఆందోళనలు 12వ రోజుకు చేరుకున్నాయి. ఎముకలు కొరికే చలిలోనూ రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. సాగు చట్టాలను రద్దు చేసేవరకు వెనుదిరిగేది లేదని తెల్చిచెబుతున్నారు. సింఘు సరిహద్దు (హరియాణా-దిల్లా సరిహద్దు)లో రాత్రిళ్లు సైతం రోడ్లపైనే ఉంటూ ధర్నాను కొనసాగిస్తున్నారు రైతులు.

కేంద్రంతో ఐదుదఫాలుగా జరిగిన చర్చల్లో ఎలాంటి సానుకూల ఫలితం రాకపోవటం వల్ల డిసెంబర్​ 8న దేశవ్యాప్తంగా బంద్​కు పిలుపునిచ్చాయి రైతు సంఘాలు. ఈ క్రమంలో వారికి దేశవ్యాప్తంగా ప్రజలు, రాజకీయ పార్టీలు, క్రీడాకారులు, సామాజిక కార్యకర్తలు, కార్మిక సంఘాల నుంచి పెద్దఎత్తున మద్దతు లభిస్తోంది. రేపటి భారత్​ బంద్​లో తామూ పాల్గొని రైతులకు మద్దతుగా నిలుస్తామని ఇప్పటికే ప్రకటించారు.

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టిన రైతుల వద్దకు వెళ్తున్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్​. సింఘూ సరిహద్దులో రైతుల కోసం ప్రభుత్వం చేసిన ఏర్పాట్లను పరిశీలించనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -