గత కొద్ది రోజులుగా తెలంగాణా సీఎం కేసీఆర్ చంద్రబాబుకు ఇచ్చేగిఫ్ట్ పైనె అందరి చూపు నెలకొంది. ఎలాంటి గిఫ్ట్ ఇస్తారోనని తెలుగు ప్రజలు ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ గిఫ్ట్ ఉండనే ఉంటాది కాని …ఇప్పుడు మాత్రం బాబుకు రెండో గిఫ్ట్ రెడీగా ఉందనే వార్తలు కలకలం రేపుతున్నాయి. రెండో గిఫ్ట్ ఇచ్చే ది ఎవరనేది అందరిలో ఆసక్తికరంగా మారిది. ఆ రెండో గిఫ్ట్ ఎవరు ఇస్తారో తెలుసు కోవాలనుకుంటున్నారా…..? వస్తున్నా అక్కడికే వస్తున్నా….?
తెలంగాణాలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో టీఆర్ ఎస్ను ఓడించేందుకు బాబు చేయని ప్రయత్నాలు లేవు. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చాక టీడీపీ అడ్రస్ గల్లంతయ్యిన సంతి తెలిసిందే. ఎన్నికల్లో బాబు జోక్యం చేసుకోవడంతో రగిలిపోయిన కేసీఆర్ బాబుకు గిఫ్ట్ ఇస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే అది ఏగిఫ్ట్ అనేది తెలియక పోయినా ఏపీలో మాత్రం బాబుకు బిగ్గెస్ట్ గిఫ్ట్ ఇవ్వడానికి రెడీగా ఉందంట.
రెండో గిఫ్ట్ ఇచ్చేది ఎవరో కాదు డ్వాక్రా మహిలలు. 2014 ఎన్నికల్లో డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫి చేస్తామని హామి ఇచ్చిన బాబు అధికారంలోకి వచ్చాక దాన్ని తుంగలోకి తొక్కారు. తీరా ఎన్నికల సమయంలో బాబు పసుపు- కుంకుమ పేరుతో కొత్త నాటకానికి తెరతీశారు. డ్రాక్రామహిలలందరికి ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పు మూడు విడతలు పసుపు-కుంకుమ పథకం కింద చెల్లిస్తామని మూడు చెక్కులు ఇచ్చి ఆర్భా టంగా ప్రకటించారు.
బాబు ప్రకటించిన పసుపు- కంకుమ పథకం ఫెయిల్ అయ్యింది. ఈ పధకం కింద కొదరికి మాత్రమే రూ.10 లు వచ్చాయి. కాని మిగిలిన డ్వాక్రామహిలలకు మొండి చేయిచూపారు. టీడీపీకి అనుకూలంగా ఓటు వేస్తారనె వాళ్లకు చెక్కులు ఇస్తున్నారు. మిగిలిన వాల్లకు మాత్రం ఇచ్చిన చెక్కులు మాత్రం బౌన్స్ అవుతున్నాయి. దీంతో పెద్ద ఎత్తున మహిళలు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. మేము కట్టిన వడ్డే మాకు ఇస్తున్నారని అంతకు మించి ఒక్క రూపాయి ఊడా ఇవ్వడంలేదని రగిలిపోతున్న డ్వాక్రామహిలలు ఓటింగ్లో మాత్రం తమ ప్రతాపాన్ని చూపించారనె వార్తలు వినిపిస్తున్నాయి. బాబుకు ఓటమిగా రెండో గిఫ్ట్ డ్రాక్రామహిళలే ఇస్తారనె ప్రచారం జరుగుతోంది.