- Advertisement -
ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్ముకశ్మీర్లో తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. స్థానిక సమరంలో భాగంగా ఫస్ట్ఫేజ్ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ మధ్యాహ్నం 2 గంటల వరకు జరగనుంది. 43 డీడీసీలు, సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.
అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ.. ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మొదటి దశలో డీడీసీ, సర్పంచ్, ఉప ఎన్నికల్లో మొత్తం 1427 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.
జమ్ముకశ్మీర్లోని 20 జిల్లాల్లో మొత్తం 280 స్థానాలకు 8 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 19 వరకు ఎన్నికలు పూర్తి కానున్నాయి. డిసెంబర్ 22న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
అంతర్జాతీయ విమాన ప్రయాణ సర్వీసులపై నిషేధం పొడిగింపు..!
ప్రిడేటర్ డ్రోన్లను చూశారా..!