లక్షలాది డేరా జాతి ప్రజల ఆరాధ్యుడు, రాక్స్టార్ బాబాగా , చుట్టూ జడ్ ప్లస్ సెక్యూరిటీ …విలాసవంత మైన జీవితం గడిపిన గుర్మీత్ చివరికి జైలు ఊచలు లెక్కించాల్సి వచ్చింది. ఇద్దరు సాద్వినిలపై చేసిన అత్యాచారం కేసులో దోషిగా రుజుకావడంతో సీబీఐ కోర్టు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అయితే డేరా బాబా చేసిన అకృత్యాల పాపాల చిట్టాగురించి ఆయన బాడీగార్డ్ బియాంత్ సింగ్ భయంకరమైన నిజాలు బయటపెట్టాడు.
గుర్మీత్ బాబా 270 మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పారు. సిర్సాలో పితాజీ గుఫాగా పిలిచే గుర్మీత్ అధికారిక నివాసం గుహ కాదని, యువతుల పాలిట నరకమని, అత్యాచారాలకు గురయ్యే అబలల ఆక్రందనలతో ప్రతిధ్వనించిన పాపకూపమని ఆయన వ్యాఖ్యానించారు.
భక్తిభావంతో డేరా సచ్చా సౌదాలో చేరి సేవ చేయాలనుకున్న సాధ్వీలను గుర్మీత్ వంతులవారీగా బలవంతంగా అనుభవించాడంటూ బియాంత్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 1995-96లో మౌంట్ అబులో గుర్మీత్ సత్సంగ్ నిర్వహించిన సమయంలో …గుర్మీత్ ఒక 16-17 ఏళ్ల అమ్మాయిని పిలిచి, ఆ టెంట్ లోకి బాలికను బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ అమ్మాయి ఆర్తనాదాలు తాను స్పష్టంగా విన్నానని చెప్పాడు.
సిర్సాలోని ప్రధాన ఆశ్రమంలో ఆయన ‘గుఫా’ వద్దకు చాలా మంది అమ్మాయిలు వచ్చేవారని, వారిలో ఒక యువతితో డేరాలో రాత్రంతా గడిపేవాడని ఆయన తెలిపారు. దీనిగురించి చర్చించుకొనే వారమని…గుర్మిత్ రాసలీలు చూసి వారితో విభేధించె వాడినని వెల్లడించారు. 300 మంది సాధ్వీల్లో 90 శాతం మంది అతడి కామదాహానికి బలైనవారేనని ఆయన సంచలన విషయాలు వెల్లడించారు. ఇద్దరిపై చేసిన అత్యాచారం కేసులో మాత్రమే శిక్షపడిందని అది సరపోదని ఆగ్రహం వ్యక్తం చేశారు.