Sunday, May 19, 2024
- Advertisement -

నయీం కేసు లో డొంక కదులుతోంది

- Advertisement -

గ్యాంగ్ స్ట‌ర్ న‌యీమ్ కేసులో తీగ క‌దిపితే డొంకంతా క‌దులుతోంది. న‌యీమ్ వెనుక బ‌ల‌మైన శ‌క్తులు లేకుండా ఇలాంటి దందాల‌కు ఎలా పాప్ప‌డ‌గ‌ల‌డు? అన్న‌ సందేహం క‌ల్గిన‌ప్పుడు.. అత‌ని వెనుక పోలీసు అధికారులు…రాజ‌కీయ నాయ‌కులు ఉన్నార‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. కానీ మంత్రి స్థాయిలో ఉన్న వాళ్లే నయీమ్ పేరు చెప్పుకుని దందాలు చేసిన వైనం విస్తుపోయేలా చేసింది.

న‌యీమ్ కేసును ద‌ర్యాప్తు చేస్తోన్న (సిట్) ఆ మాజీ మంత్రికి నోటీసులు జారీ చేసింది. అయితే మంత్రి వివ‌రాల‌ను మాత్రం సిట్ గోప్యంగా ఉంచుతోందివాస్త‌వానికి ఆ మంత్రి న‌యీమ్ మ‌ర్డ‌ర్ అనంత‌రం సిటీలో క‌నిపించ‌డంలేదట‌. అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడ‌ని ఆయ‌న పై నిఘా పెట్టిన‌ పోలీసులు అనుమానిస్తున్నారు. స‌ద‌రు మంత్రివ‌ర్యులు ప‌దేళ్ల పాటు న‌యీమ్ తో స్నేహాన్ని కొన‌సాగించాడ‌ట‌.

ఖాళీగా క‌నిపించిన ప్ర‌తి భూభాగంపై స‌ద‌రు మంత్రి జెండా పాతేవాడ‌ట‌. మాదాపూర్ లో ఖాళీగా ఉన్న ప‌ది ఎక‌రాల భూమిని న‌యీమ్ మ‌నుషుల‌తో బెదిరించి ఓ వ్యాపారి నుంచి స్వాధీనం చేసుకున్న‌ట్లు లోక‌ల్ పీఎస్ లో గ‌తంలో కేసు న‌మోదైంది. ఈ సంగ‌తుల‌న్నీ సిట్ ద‌ర్యాప్తులో వెలుగులోకి వ‌చ్చాయి. ఆయ‌న‌తో పాటు ఓ ఎమ్మెల్యే కూడా దందాల‌కు పాల్ప‌డినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్ప‌టికే వీరిద్ద‌రికీ నోటులు జారీ కావ‌డంతో పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో బ‌య‌ట‌కు రానున్నాయ‌ని పోలీసులు చెబుతున్నారు.

Related

  1. సంచలనం : నయీం చివరి కోరిక తీరుస్తున్న తెలుగు డైరెక్టర్
  2. షాకింగ్ : నయీం బ్యాచ్ లో అందరూ తెరాస లీడర్లు
  3. వైజాగ్ లో కూడా నయీం దందాలు .. !
  4. నయీం కేసు లో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -