- Advertisement -
ఒడిషాలోని కోరాపుట్ జిల్లా పాడువా పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా సిబ్బందికి మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో మగ్గురు మహిళలు ఉన్నారు. ఘటనాస్థలంలో 3 ఎస్ఎస్ఆర్, 2 ఇన్సాస్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. కిటుబకంటి అటవీ ప్రాంతంలో కాల్పులు కొనసాగుతున్నాయి. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి.