Thursday, May 2, 2024
- Advertisement -

సీతా సమేతంగా పరదేశి రామలక్ష్మణులు!

- Advertisement -

ఇరవై ఏళ్ల క్రితం తమిళనాడులోని ఓ ప్రాచీన ఆలయం నుంచి చోరీకి గురై బ్రిటన్​కు తరలిపోయిన 13వ శతాబ్దం నాటి రామ, లక్ష్మణ, సీత కాంస్య విగ్రహాలు మళ్లీ స్వదేశానికి తిరిగొచ్చాయి. వాటిని కేంద్ర సాంస్కృతిక, పర్యటక శాఖ మంత్రి ప్రహ్లాద్​ పటేల్​ బుధవారం దిల్లీలోని భారత పురావస్తు శాఖ ప్రధాన కార్యాలయంలో తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించారు.

తమిళనాడులోని నాగ పట్టణం జిల్లా ఆనందమంగళంలోని విజయనగర రాజుల కాలంలో నిర్మించిన శ్రీ రాజగోపాల్​ విష్ణు ఆలయం నుంచి రామ, లక్ష్మణ, సీత విగ్రహాలు చోరీ అయినట్లు గుర్తించిన ఇండియా ప్రైడ్​ ప్రాజెక్టు అధికారులు, వాటిని బ్రిటన్​కు తరలించి ఉండొచ్చని లండన్​లోని భారత హైకమిషన్​ కార్యాలయానికి గతేడాది ఆగస్టులో తెలియజేశారు. దీంతో వారు రంగంలోకి దిగారు. అదృష్టవశాత్తు 1958లో తీసిన ఆ విగ్రహాల ఫొటోలను భద్రపరచటం వల్ల వాటి ఆచూకీని కనిపెట్టడం సాధ్యమైందని ప్రహ్లాద్​ తెలిపారు.

తమిళనాడు పోలీసు శాఖలోని విగ్రహాల విభాగం పాత రికార్డులను అధ్యయనం చేసి ఆ శిల్పాలు 1978 నవంబర్​ 23-24 తేదీల్లో చోరీ అయినట్లు తేల్చారన్నారు. దీంతోపాటు ఆ నేరానికి పాల్పడిన దొంగలనూ పట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ ఆధారాలన్నింటినీ లండన్​ పోలీసులకు అందజేయడం వల్ల వారు దర్యాప్తు చేపట్టి ప్రస్తుతం ఆ విగ్రహాలను సొంతం చేసుకున్న యజమానిని గుర్తించారని చెప్పారు. అనంతరం ఆ విగ్రహాలను స్వాధీనం చేసుకుని సెప్టెంబర్​ 15న అక్కడి భారత హైకమిషన్​ కార్యాలయంలో అప్పగించారు.

ట్రంప్- బైడెన్ ఒకే దాటి పై కీలక స్పందన..!

ఓరి ద్యావుడా.. పావురం ధర రూ. 14కోట్లు.. ఇంతకీ స్పెషల్ ఏమిటి..?

గబ్బర్ సింగ్ డైలాగ్స్ కొట్టి చిక్కుల్లో పడ్డ పోలీస్!

జో బైడెన్‌.. పంచాయతీ షురూ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -