- Advertisement -
ఛత్తీస్ గఢ్ లోని దంతరి అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జిరగింది. ఈ ఎన్కౌంటర్లో నలుగురు నక్సల్స్ మరణించారు. యాంటీ నక్సల్ ఆపరేషన్ లో భాగంగా జిల్లాలోని ఖల్లారి-మెచ్కా గ్రామాల మధ్య అడవుల్లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో వీరికి ఎదురుపడ్డ మావోయిస్టులు కాల్పులకు పాల్పడడంతో ఎస్టీఎఫ్ పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు.
ఈ సందర్బంగా మృతి చెందిన నలుగురు మావోయిస్టుల్లో ముగ్గురు మహిళలు ఉన్నట్టు పోలీస్ అధికారులు తెలిపారు. సంఘటనా స్థలం నుంచి నాలుగు మృతదేహాలను, ఏడు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.